విద్యార్థిని సన్మానించిన రిజిస్ట్రార్..

నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ లో గిరిజన శక్తి స్టూడెంట్ ఆర్గనైజేషన్ అధ్వర్యంలో గత నాలుగు రోజుల క్రితం నిర్వహించిన గ్రూప్-2 గ్రాండ్ టెస్ట్ లో వర్సిటీ విద్యార్థి నవీన్ కుమార్ కి రాష్ట్రంలో 4వ ర్యాంకు రావడంతో యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం యాదగిరి శుక్రవారం తన కార్యాలయంలో  విద్యార్థికి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యూనివర్సిటీ విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని, ఉన్నత స్థానాలకు ఎదగాలని రిజిస్ట్రార్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు శ్రీను నాయక్, సాగర్ నాయక్, ఎన్ ఎస్ యుఐ అధ్యక్షుడు శ్రీశైలం, ఉపాధ్యక్షుడు రాజేందర్ ఉన్నారు.
Spread the love