జీవన్ రెడ్డిని గెలిపించండి..అభివృద్ధిని నేను చూసుకుంటా: మానాల మోహన్ రెడ్డి

నవతెలంగాణ – కమ్మర్ పల్లి
నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డిని గెలిపిస్తే అభివృద్ధిని తాను చూసుకుంటానని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం బాల్కొండ నియోజకవర్గంలోని  రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల గ్రామ పరిధిలోని కీమా నాయక్ తండాలో ఆయన పర్యటించారు. గ్రామస్తులు, ఉపాధి హామీ కూలీలు, యువకులతో ముచ్చటించి జీవన్ రెడ్డిని పార్లమెంట్ ఎంపీగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా మానాల మోహన్ రెడ్డి  మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా కీమా నాయక్ తండాలో కేవలం కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి మాత్రమే ఉందని, బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలు చేసిందేమీ లేదన్నారు. పది సంవత్సరాలుగా కీమా నాయక్ తాండ పూర్తిగ నిర్లక్ష్యానికి గురైందని, కీమా నాయక్ తండ వాసులందరూ ఏకతాటిపైకి వచ్చి నిజామాబాద్ ఎంపీగా జీవన్ రెడ్డిని గెలిపించాలని, కీమా నాయక్ తాండ అభివృద్ధిని నేను చూసుకుంటానని ఆయన మాట ఇచ్చారు.
ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఆరోగ్య శ్రీ ని 10 లక్షల వరకు పెంపుగాని, ఉచిత విద్యుత్ బిల్లులు కానీ, రూ.500 లకే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలను అమలు చేసిందన్నారు. అదేవిధంగా పార్లమెంటు ఎన్నికల తర్వాత పేదలకు ఇల్లు నిర్మించుకోవడానికి ఆరు లక్షల రూపాయలు అందిస్తామని, మహాలక్ష్మి ద్వారా ప్రతి మహిళకు రూ.2500 ఇస్తామని, రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలో భాగంగా లక్ష రూపాయల ఆర్థిక సాయం చేస్తామని, రూ.4వేల పెన్షన్, రైతు రుణమాఫీ చేస్తామని తెలిపారు. ఈ గ్రామానికి అన్ని పథకాలు తెచ్చే బాధ్యత నాదని మానాల మోహన్ రెడ్డి మాట ఇచ్చారు.పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డిని ఆదరించి భారీ మెజారిటీతో గెలిపించాలని మానాల మోహన్ రెడ్డి తండా వాసులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ రాష్ట్ర జాయింట్ కార్యదర్శి జక్కు వంశీ, జాక్కు మోహన్, రఘుపతి, మల్లేష్, కొమ్ముల రాజేందర్, జక్కు లింగారెడ్డి, జక్కథలాల్, తిరుపతి, విఠల్, బుర్ర నారాగౌడ్, కొమ్ముల గంగారెడ్డి, పెద్ద గంగాధర్, తదితరులు పాల్గొన్నరు.
Spread the love