అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం

నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండలంలో శ్రీరామనవమి పురస్కరించుకొని బుధవారం రామాలయాల్లో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయాల వద్ద సీతారాముల కల్యాణానికి తరలివచ్చిన భక్తులకు అన్న వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. మండలంలోని నాగపూర్ లో శ్రీరామనవమి సందర్భంగా ఆలయ 63వ వార్షికోత్సవ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో  స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపారు. స్వామివారికి బంగారం పుస్తె, మట్టెలు, ముత్యాల తాళంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. మండల కేంద్రంలోని శ్రీ గిరిక్షేత్రం వద్ద సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు.  వేలాదిగా తరలివచ్చిన భక్తుల సమక్షంలో కళ్యాణాన్ని కన్నుల పండుగ నిర్వహించి, అనంతరం భక్తులకు అన్నవితరణ చేశారు. ఉదయం హనుమాన్ మాల ధారణ స్వాములు సీతారాముల ఉత్సవ విగ్రహాలతో గ్రామంలో శోభాయాత్ర నిర్వహించారు. ఈ శోభ యాత్రలో పెద్ద సంఖ్యలో స్వాములతో పాటు యువకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Spread the love