నవతెలంగాణ – హైదరాబాద్: శ్రీహరికోటలోని షార్ వేదికగా ఇవాళ ఉదయం చేపట్టాల్సిన అగ్నిబాణ్ రాకెట్ ప్రయోగం సాంకేతిక కారణాలతో మరోసారి వాయిదా పడింది. మళ్లీ ఎప్పుడు నిర్వహించేది త్వరలో వెల్లడిస్తామని సైంటిస్టులు తెలిపారు. ప్రయివేటు స్టార్టప్ కంపెనీ అగ్నికుల్ కాస్మోస్ ఈ రాకెట్ను రూపొందించింది. దేశంలోనే తొలి సెమీ క్రయోజనిక్ ఇంజిన్ ఆధారిత రాకెట్గా ఇది రికార్డులకెక్కింది. కాగా ఇప్పటికే 3సార్లు ప్రయోగం వాయిదా పడింది.