లివర్ సమస్యతో బాధపడుతున్న బాలునికి చేయూత

– రూ.10 వేలు అందజేసిన యాదవ సంఘం
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన బుట్టి శ్యామల రాజ్ కుమార్ యాదవ్ దంపతుల ఏడు నెలల కొడుకు హర్షిత్ కుమార్ గత నాలుగు నెలలుగా లివర్ సమస్యతో బాధపడుతున్న విషయాన్ని సోషల్ మీడియా  ద్వారా తెలుకున్న అఖిల భారత యాదవ మహాసభ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు మేకల సంపత్ యాదవ్ శనివారం తన బృందంతో వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించి అధైర్య పడవద్దు అన్నివిధాలా యాదవ సంఘం అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.బాలున్నీ ఆర్థికంగా ఆదుకోవడానికి అన్ని వర్గాల దయనియులు ముందుకు రావాలని కోరారు.తమ వంతుగా రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందజేసినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు పాల్గొన్నారు.
Spread the love