విగ్రహాల కమిటీ అధ్యక్షుడిగా ఐత రాజు

నవతెలంగాణ – రాయపర్తి
మండలంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రావ్ విగ్రహాల నూతన కమిటీని ఆదివారం దళిత రత్న అవార్డు గ్రహీత, కమిటీ గౌరవ అధ్యక్షుడు ఐత యాకయ్య ఆధ్వర్యంలో ఎన్నుకోవడం జరిగింది. నూతన అధ్యక్షుడిగా ఐత రాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఐత రాజు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవాలు అంబెడ్కర్, బాబు జగ్జీవన్ రావ్ ఆశయ సాధన కోసం పనిచేస్తానని తెలిపారు. అణగారిన వర్గాల కోసం ఎనలేని కృషి చేసిన జాతీయ నాయకుల అడుగుజాడల్లో నడవలన్నారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో ఎంపీటీసీ ఐత రాంచందర్, ఐత బ్రహ్మం, ఐత గడ్డం కుమర్, దళిత రత్న గ్రహీత ఐత మల్లేష్, ఐత బాబులాల్, ఐత శంకర్, ఐత రవి, పీరని రాజు, ఐత భాస్కర్, పీరని రవీందర్, కంతుల జంపాయ, కరుణాకర్, నల్ల కుమార్  తదితరులు పాల్గొన్నారు.
Spread the love