నవతెలంగాణ – శ్రీనగర్: అమర్నాథ్ యాత్ర ఈరోజు ప్రారంభమైంది. శ్రీనగర్లోని హిమాలయాల్లో ఉన్న బోలేనాథుడి దర్శనం కోసం బాల్టాల్, నునావన్ క్యాంపుల మొదటి బ్యాచ్ యాత్రికులు బయలుదేరారు. ఈ మేరకు అధికారులు సమాచారం అందించారు. హిమాలయాల్లోని దక్షిణ కశ్మీర్లో సుమారు 3880 మీటర్ల ఎత్తులోని ఓ గుహలో భక్తులు మంచు శివలింగాన్ని దర్శనం చేసుకోనున్నారు.