నవతెలంగాణ- హైదరాబాద్: అమెరికా సైనికుడు ఉత్తర కొరియా శరణుకోరినట్టు ఆ దేశం ప్రకటించింది. అమెరికా సైన్యంలో నెలకొన్న వివక్ష మూలంగా తన మనస్సు వికలంగా మారిందని.. అందుకే శరణు కోరుతున్నట్టు సైనికుడు చెప్పాడని.. ఉత్తర కొరియా ప్రకటించింది. ఉత్తరకొరియాలో ప్రవేశించిన అమెరికా సైనికుడిపై తొలిసారిగా అక్కడి ప్రభుత్వం అధికారికంగా స్పందించింది. ఉభయ కొరియాల మధ్య ఉన్న సంయుక్త గస్తీ నిర్వహణ ప్రాంతం నుంచి అక్రమంగా తమ దేశంలోకి ప్రవేశించిన అమెరికా సైనికుడు ట్రావిస్ టి.కింగ్ పై ఉత్తరకొరియా అధికారిక ప్రకటన చేసింది. అమెరికా సైన్యంలోని అమానవీయ ప్రవర్తన, జాతి వివక్ష కారణంగానే తాను సరిహద్దులు దాటి ఉత్తరకొరియాలోకి ప్రవేశించినట్లు సైనికుడు చెప్పాడని తెలిపింది.