మహంతం రైల్వే గేట్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి

నవతెలంగాణ – నవీపేట్: మండలంలోని అభంగపట్నం శివారు మహంతం రైల్వే గేట్ వద్ద గుర్తు తెలియని మృతదేహం మంగళవారం లభ్యమయింది. సమాచారం మేరకు స్థానిక వీఆర్ఏలు సంఘటన స్థలం వద్దకు వెళ్లి చూడగా గుర్తుతెలియని వ్యక్తి  రైల్వే ట్రాక్ శివారులో మృతి చెంది ఉండటంతో రైలు నుండి పడిపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. రైల్వే పోలీసులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి వచ్చి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.
Spread the love