ఇక టెస్టు సవాల్‌!

– భారత్‌, దక్షిణాఫ్రికా మహిళల ఏకైక టెస్టు నేటి నుంచి
నవతెలంగాణ-చెన్నై : వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన టీమ్‌ ఇండియా అమ్మాయిలు… చెపాక్‌లో టెస్టు పోరుకు సిద్ధమయ్యారు. సుమారు పుష్కర కాలం తర్వాత దక్షిణాఫ్రికా మహిళలతో టెస్టు పోరు ఆడుతున్న భారత్‌ మరో విజయంపై కన్నేసింది. నేడు చెన్నై చెపాక్‌ స్టేడియం వేదికగా భారత్‌, దక్షిణాఫ్రికా మహిళల ఏకైక టెస్టు మ్యాచ్‌ ఆరంభం కానుంది. గత ఐదు టెస్టుల్లో ఓటమెరుగని టీమ్‌ ఇండియా హాట్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుంది. గత ఐదు టెస్టుల్లో సఫారీ అమ్మాయిలు మూడు పరాజయాలు చవిచూసి ఓ విజయం సాధించారు. వన్డేల్లో చిత్తయిన సఫారీలు టెస్టుల్లోనైనా కనీస పోటీ ఇస్తారేమో చూడాలి. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, వైస్‌ కెప్టెన్‌ స్మృతీ మంధాన, రిచా ఘోష్‌, జెమీమా రోడ్రిగస్‌, దీప్తి శర్మలు భారత్‌కు కీలకం కానున్నారు. సఫారీ తరఫున కెప్టెన్‌ లారా, అన్నెక, మారిజెనా, క్లాస్‌లు కీలక పాత్ర పోషించనున్నారు.

Spread the love