బహుజన వాదాన్ని తాకట్టు పెట్టిన ఆందోజు శంకరాచారి…

– బి.ఎస్.పి చౌటుప్పల్ మండల అధ్యక్షులు తగరం సుభాష్ చంద్రబోస్
నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్:
మునుగోడు నియోజకవర్గ బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆందోజు శంకరాచారి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేశా న్ని ఉపసంహరించుకొని బహుజన వాదాన్ని బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు తాకట్టు పెట్టడానీ చౌటుప్పల్ మండల బీఎస్పీ అధ్యక్షులు తగరం సుభాష్ చంద్రబోస్ బుధవారం రాత్రి హెచ్చరించారు.ఆందోజు శంకరాచారిని మునుగోడు ఉప ఎన్నికల్లో ఒకసారి ఇప్పుడు జరుగుతున్న  సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా బిఎస్పి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీసీ బిడ్డగా అవకాశం ఇస్తే ఈరోజు శంకరాచారి ఇతర పార్టీలకు డబ్బులకు అమ్ముడుపోయాడని తగరం సుభాష్ చంద్రబోస్ చెప్పారు.తక్షణమే ఆందోజు శంకరాచారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఆయన పైన కేసు నమోదు చేయాలని కోరారు.బెహాన్ జీ కుమారి మాయావతి నాయకత్వంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో బహుజన వాదాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మా వంతు పాత్ర ఈ ఎన్నికల్లోనే పోషిస్తామని తగరం సుభాష్ చంద్రబోస్ తెలిపారు.ఈ కార్యక్రమంలో మాద రమేష్,ఎర్ర దానయ్య తదితరులు పాల్గొన్నారు
Spread the love