పర్యావరణ కథల పోటీలో బహుమతి పొందిన అనిశెట్టి సతీష్ కుమార్

నవతెలంగాణ – సిద్దిపేట
మన చుట్టూ వున్న పర్యావరణాన్ని అమితంగా ప్రేమించే పిల్లలను పర్యావరణానికి దగ్గర చేయాలనే సదుద్దేశంతో హైదరాబాద్ కు చెందిన చిల్డ్రన్ ఎడ్యుకేషన ల్ అకాడమీ చైర్మన్  మణికొండ వేదకుమార్ ఆధ్వర్యంలో ‘బాల చెలిమి’ పిల్లల వికాస పత్రిక వారు నిర్వహించిన పర్యావరణ కథల పోటీలు-2023 వందల సంఖ్యలో రచయితల నుండి కథలు రావడం జరిగింది. అందులో నగదు బహుమతి పురస్కారానికి సిద్దిపేటకు చెందిన రచయిత అనిశెట్టి సతీష్ కుమార్  రాసిన కథ ‘ప్లాస్టిక్ శత్రువు-మన మిత్రువు’ ఎంపిక కావడం జరిగింది. సతీష్ కుమార్ రాసిన కథ బహుమతికి ఎంపిక కావడం పట్ల సిద్దిపేట కవులు ఉండ్రాళ్ళ రాజేశం, బస్వ రాజ్ కుమార్, కోణం పరశరాములు, బైతి దుర్గయ్య, పెందోట వెంకటేశ్వర్లు తదితరులు అభినందనలు తెలిపారు.
Spread the love