నవతెలంగాణ-నెల్లికుదురు
మండలంలోని ఎంపీ యుపిఎస్ భారతమ్మ గూడెం ఎంపీ యపిఎస్ రావిరాల గ్రామాలకు ప్రైమరీ తరగతులకు బోధించేందుకు ఇన్స్ట్రక్టర్ మరియు ఆయా పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎంఈఓ రామదాసు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ 2026-2027వ విద్యా సంవత్సరానికి మండలంలోని పార్వతమ్మ గూడెం రావిరాల గ్రామాల పాఠశాల ప్రీ ప్రైమరీ తరగతులు ఈ విద్యా సంవత్సరానికి బోధిచేందుకు రెండు పాఠశాల ఎంపిక అని అన్నారు.ఈ రెండు పాఠశాలలకు అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించబడుతున్నాయి.
అభ్యర్థులు స్థానికులై ఉండవలెను. కావున ఈనెల మూడవ తారీకు (3/6/2026) నుండి ఆరో తారీకు (6/6/2026) వరకు అభ్యర్థుల నుండి దరఖాస్తులు మండల రిసోర్స్ సెంటర్ ఎం ఆర్ సి లో ఇవ్వవలసిందిగా కోరనైనది. ప్రీ ప్రైమరీ బోధించుటకు ఇన్స్పెక్టర్లు ఇంటర్మీడియట్ లేదా తత్ సమానమైన అటువంటి కోర్సు అర్హతగా ఉంటుంది. ఆయా పోస్ట్ కి ఏడవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.



