తలనొప్పి ప్రతీ ఒక్కరిలో సర్వసాధారణంగా వచ్చే సమస్య. మనలో చాలా మంది ఏదో ఒక సమయంలో తలనొప్పి సమస్యను ఎదుర్కొనే ఉంటారు. నిద్రలేకపోవడం మొదలు మరెన్నో కారణాలతో తలనొప్పి వేధిస్తుంటుంది. మనలో చాలా మంది తలనొప్పి రాగానే వెంటనే మందులు వేసుకుంటారు. అయితే ట్యాబ్లెట్ వేసుకుంటే వెంటనే ఉపశమనం లభిం చినా వాటివల్ల కలిగే దుష్ప్రభావాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. అందుకే తలనొప్పిని వీలైనంత వరకు సహజ మార్గాల ద్వారానే తగ్గించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పెయిన్ కిల్లర్స్కి అలవాటు పడడం ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.