ఆర్టీసీ బస్సు ఢకొీని ఆశా కార్యకర్త మృతి

– రోడ్డుపై ఆశా కార్యకర్తల ఆందోళన
నవతెలంగాణ- రఘునాథపాలెం
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం కోయ వెంకయ్య బంజార వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆశా కార్యకర్త ప్రాణం కోల్పోయారు. మోటార్‌ సైకిల్‌పై వెళుతున్న మాలోతు విజయ(40) దంపతులను ఏన్కూర్‌ నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సుకోయ వెంకయ్య బంజార వద్ద ఢకొీట్టింది. బైక్‌పై వెనుక కూర్చున్న విజయ బస్సు వెనుక చక్రాల కిందపడ్డారు. తలపై నుంచి బస్సు వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందారు. గాయపడిన ఆమె భర్త రవిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. మృతురాలు విజయ కోయవెంకయ్య బంజారలో ఆశా కార్యకర్తగా పనిచేస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని సీఐటీయు ఆధ్వర్యంలో తోటి ఆశా కార్యకర్తలు, స్థానికులు రోడ్డుపై ఆందోళనకు దిగారు. పోలీసులు సర్దిచెప్పడంతో విరమించారు.

Spread the love