రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం..

నవతెలంగాణ-చందుర్తి :  రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. చందుర్తి మండలం మాల్యాల గ్రామంలో గురువారం తెల్ల వారుజామున ఈ ఘటన జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పడిగేలా నరేష్ (25) అనే యువకుని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనకు సంబందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతుడు గత పది రోజుల కిందట గల్ఫ్ నుండి వచ్చినట్లుగా తెలిసింది. ఘటన స్థలానికి సిఐ కిరణ్ కుమార్ వెళ్లి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love