లోన్ చెల్లించని ఇంటిని జప్తు చేసిన బ్యాంక్ అధికారులు..

నవతెలంగాణ-భిక్కనూర్
భిక్కనూరు పట్టణంలో కెనరా బ్యాంకు నుండి పట్టణానికి చెందిన ఒక మహిళ 12 లక్షల రూపాయలు తన సొంత ఇంటిని మార్గజ్ ద్వారా లోన్ తీసుకోగా లోన్ డబ్బులు, వడ్డీ కట్టని పక్షంలో బ్యాంక్ అధికారులు శుక్రవారం ఇంటిని జట్టు చేశారు. ఈ సందర్భంగా బ్యాంకు అధికారులు మాట్లాడుతూ లోన్ డబ్బులు కట్టాలని ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసిన సమాధానం లేని పక్షంలో ఇంటిలో ఉన్న మహిళను ఇంటి నుండి ఖాళీ చేసి ఆన్ లైన్ లో అమ్మేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో శివప్రసాద్, ఏఎస్ఐ జగదీష్, రీజినల్ అధికారి చంద్రభూషణ్, బ్యాంక్ సిబ్బంది భార్గవ్, సుధీర్, ఈశ్వర్ బాబు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love