ఘనంగా బతుకమ్మ సంబరాలు

నవతెలంగాణ – నాంపల్లి: తెలంగాణ ఆడపడుచుల ప్రతిష్టాత్మక పండుగ అయిన బతుకమ్మ సంబరాలను బుధవారం నాంపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ గంధం మోహన్ రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మహిళా అధ్యాపకులు విద్యార్థులతో కలిసి ఒక్కొక్క పువ్వును పేర్చి  అందమైన బతుకమ్మలను తయారు చేశారు. పూల పండుగ అయిన బతుకమ్మ ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించి ఆటపాటలు, కోలాటాల మధ్య బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా అధ్యాపకులు విద్యార్థులు చేసిన నృత్యాలు పలువురిని అలరించాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ గంధం మోహన్ రావు,  అధ్యాపకులు వెంకన్న,  రజినీకాంత్,  శ్రీనివాస్, సృజన్ కుమార్, సురేష్, ముత్యాలు, శిరీష, శైలజ, సమత, రజియా,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love