బీజేపీ, బీఆర్ఎస్ కీ భారీ షాక్

– 20 కుటుంబాలు కాంగ్రెస్ లో చేరిక
నవతెలంగాణ -పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం నాయినవాని కుంటలో బీజేపి మండల ప్రధాన కార్యదర్శి కొట్టె కోటయ్య యాదవ్ ఆధ్వర్యంలో 10 యాదవ కుటుంబాలు, అదేవిదంగా మరో 10 బీఆర్ఎస్ కు చెందిన యాదవ కుటుంబాలు  మలిదశ ఉద్యమ కారులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులువాసికర్ల వినయ్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూన్ రెడ్డి రాఘవరెడ్డి, ఉపసర్పంచ్ వాసికర్ల విక్రమ్ రెడ్డి, అధ్వర్యంలో బుధవారం కాంగ్రెస్ లో చేరారు. వీరికి పార్టీ కండువాలు కప్పి సాధరముగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందపరచిన ఆరు హామీలు బడుగు బలహీన వర్గాలకు అభివృద్ధికీ ఉపయోగంగా వున్నాయని అన్నారు. ఆరు హామీలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరారని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Spread the love