నవతెలంగాణ – హైదరాబాద్: బీజేపీ అత్యంత అవినీతి పార్టీ అని తేలిందన్నారు శివసేన యూబీటీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే. ఢిల్లీలో విపక్ష ఇండియా కూటమి నిర్వహించిన సేవ్ డెమోక్రసీ మెగా ర్యాలీలో ఆయన ప్రసంగించారు. మోడీ సర్కార్ లక్ష్యంగా విమర్శలను గుప్పించారు ఠాక్రే. బీజేపీ నిజస్వరూపం ప్రజల ముందు బట్టబయలు అయ్యిందని ఆయన అన్నారు. బీజేపీ అత్యంత అవినీతి పార్టీ అని.. బీజేపీ అంటే భ్రష్ట్ జనతా పార్టీ అని మండిపడ్డారు. బీజేపీ ‘మోడీ కా పరివార్’ ప్రచారంపై విరుచుకుపడ్డారు ఉద్దవ్ ఠాక్రే. కొవిడ్ సమయంలో తాను సీఎంగా ఉన్నప్పుడు నా కుటుంబం, నా బాధ్యత అని తను సంకల్పించినట్లు తెలిపారు. మీ కుటుంబంలో మీరు, కుర్చీ మాత్రమే ఉన్నాయని మోడీని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు ఉద్దవ్ ఠాక్రే.