యువతను నిరుద్యోగులుగా మార్చిన ఘనత బీజేపీ, బీఆర్ఎస్ లదే 

– కాంగ్రెస్ తోనే యువతకు భరోసా 
– చెఱకు శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లోకి చేరికలు 
– పార్టీ కండువా కప్పి యువతకు ఆహ్వానం
నవతెలంగాణ- దుబ్బాక రూరల్ :
10 ఏళ్లలో బీజేపీ, బీఆర్ఎస్ పాలనలో  యువతను నిరుద్యోగులుగా మార్చారని, కాంగ్రెస్ తోనే యువతకు భరోసా లభించనుందని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు.మంగళవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం గంభీర్ పూర్ గ్రామంలో 30 మంది యువత బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకి రాజీనామా చేసి చెఱకు శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు.ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ,, బీఆర్ఎస్ దొందు దొందేనని, ఎన్నికల వేళ అసత్య ప్రచారాలు చేస్తూ మళ్ళీ గద్దేనెక్కెందుకు ప్రయత్నిస్తున్నాయని అన్నారు.10 ఏళ్ల పాలనలో రెండు ప్రభుత్వాలు యువతకు ఉద్యోగావకాశాలు లేకుండా చేసి పబ్బం గడిపారని, రానున్న రోజుల్లో కాంగ్రెస్ ఉద్యోగ నోటిఫికేషన్ వేసి నిరుద్యోగులకు ఊరట లభించనుందని ,రానున్న ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైన ఆ రెండూ పార్టీలను దుబ్బాక ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు.దుబ్బాక గడ్డ పై ఈసారి కాంగ్రెస్ జెండా ఎగురవేసి భారీ మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో యువత వెంట దుబ్బాక మండల అధ్యక్షుడు కొంగరి రవి, పట్టణ అధ్యక్షులు నర్మేట ఏసు రెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మిద్దె ప్రసాద్, దుబ్బాక మున్సిపాలిటీ యూత్ అధ్యక్షులు మాస్టర్ శ్రీకాంత్ తదితరులు ఉన్నారు
Spread the love