– కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి
– ఇంటింటి ప్రచారంలో దూసుకుపోతున్న కసిరెడ్డి
నవతెలంగాణ-ఆమనగల్
ఆశీర్వదించి అసెంబ్లీకి పంపిస్తే అని అండగా ఉంటానని కల్వకుర్తి అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం నియోజకవర్గంలోని కడ్తాల్ ఆమనగల్ మండలాలతో పాటు ఆయా గ్రామాల్లో నాగర్ కర్నూల్ జడ్పీ వైస్ చైర్మెన్ బాలాజీ సింగ్ తదితరులుతో కలిసి ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో మహిళలు విజయ తిలకం దిద్దుతూ మంగళహారతులతో కసిరెడ్డి నారాయణరెడ్డిని ఘన స్వాగతం పలికారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సోనియా గాంధీ ప్రకటించిన అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఆయా గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు కసిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. రేపు రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి బీక్యా నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాట నర్సింహ ముదిరాజ్, సింగిల్ విండో డైరెక్టర్ చేగూరి వెంకటేష్, కోఆప్షన్ సభ్యులు జహంగీర్ బాబా, సేవాదళ్ అధ్యక్షులు లక్ష్మయ్య, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ రాంచందర్ నాయక్, నాయకులు వేణుపంతులు, జంగయ్య, హన్మా నాయక్, భాస్కర్ రెడ్డి, జాంగిర్ అలీ, బిక్షపతి, గోపాల్ రెడ్డి, రాజేష్, శ్రీశైలం, శ్రీకాంత్ రెడ్డి, శ్రీకాంత్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని విఠాయిపల్లి గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు 120 మంది కసిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. ఎస్టీ సెల్ శ్రీధర్ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి, లింగం, కష్ణ, రవి, జగన్ రెడ్డి, నర్సిరెడ్డి, మల్లేష్, గోపి, శ్రీను, పర్వతాలు, రవీందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.