ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదానం

నవతెలంగాణ – రెంజల్

రెంజల్ మండలం కళ్యాపూర్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యువత రక్తదానం చేపట్టారు. స్వామి వివేకానంద, సుభాష్ చంద్రబోస్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని యువజన ఉత్సవాల పురస్కరించుకుని రక్తదానం ఏర్పాటు చేయడం జరిగిందని ఫ్రెండ్స్ యూత్ అధ్యక్షులు నల్ల నవీన్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం ఏదో ఒక రూపంలో తమ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ సేవా కార్యక్రమంలో పాల్గొంటామని ఆయన చెప్పారు. గ్రామంలో సుమారు 30 మంది యువత రక్తదానం ఇవ్వడం జరిగిందన్నారు. ఇట్టి రక్త దానం షాంపులను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి ఇవ్వనున్నట్లు ఆయన తెలియజేశారు. ప్రజల్లో జాతీయతను దేశభక్తిని పెంపొందించడానికి యువత ఎల్లవేళలా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు కాశం సాయిలు, గంగోని వినోద్, మైని సంతోష్, కాలేవా ర్ సంతోష్, శివకుమార్, అచ్యుత్, గంగా ప్రసాద్, గాండ్ల మధు, మల్లారి సురేష్, వేణు, సాకలి సాయినాథ్, ఎం .నందు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love