నవతెలంగాణ-యాచారం
మండల పరిధిలోని నందివనపర్తి గ్రామానికి చెందిన పోలోజు నాగేష్ చారి, లావణ్యల కుమార్తె పూర్ణిమకు ఆస్పత్రి వైద్య ఖర్చుల నిమిత్తం శుక్రవారం బీఎన్.రెడ్డి ట్రస్టు ఆధ్యర్యంలో రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు. ట్రస్ట్ చైర్మన్ బిలకంటి శేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక అందించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కారోబార్ నూకం మహేందర్, గ్రామస్తులు సుధాకర్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.