- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : గోవాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పర్యాటకులతో వెళ్తున్న ఓ లాంచీ పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లడంతో మునిగిపోయింది. ఈ దుర్ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 64 మంది గల్లంతయ్యారు. ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ ఘటనతో తీర ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
- Advertisement -



