- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఫిలిప్పీన్స్లోని మిండనావ్ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 8.2 తీవ్రతతో భూమి కంపించింది. దీంతో ఫిలిప్పీన్స్తోపాటు ఇండోనేషియా, పలావు, తైవాన్, పపువా న్యూ గినియాకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ప్రాణ ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. దీనికంటే కొన్ని గంటల ముందు భూటాన్, చైనా, ఇండియాలోని కొన్ని ప్రాంతాల్లోనూ 5.6 తీవ్రతతో భూకంపం వచ్చింది.
- Advertisement -


