- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : టీడీపీ రాజ్యసభ అభ్యర్థులుగా సానా సతీశ్, చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి అసెంబ్లీలోని రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లి.. నామినేషన్ పత్రాలు సమర్పించారు. అంతకుముందు టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలకు శనివారం టీడీపీ అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే.
- Advertisement -



