పోచారంలో ఘనంగా బోనాల పండుగ..

నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం గ్రామంలో ఆదివారం ఘనంగా బోనాలు నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామస్తులు బోనం తలపై పెట్టుకుని గ్రామంలో ఊరేగించి ఊరు చివరన గల గ్రామదేవతలకు బోనాలు సమర్పించారు. దేవతలారా దీవించండి అంటూ వేడుకున్నారు భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకొని తమ మొక్కులను చెల్లించుకున్నారు. బోనం నిర్వహణలో పోతరాజుల విన్యాసాలు పలువురిని ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎంపీపీ టేకులపల్లి వినీత, మాజీ సర్పంచ్ విజిత శ్రీనివాసరెడ్డి తోపాటు గ్రామస్తులు గోపాల్ గౌడ్, నందు, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love