విద్యుత్ షాక్ తో బాలుడు మృతి

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
విద్యుత్ షాక్ తగిలి బాలుడు మృతి చెందిన సంఘటన హుస్నాబాద్ పట్టణంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని డిపో వెనుక మారుతీ నగర్ చెందిన సయ్యద్ సంశీర్ కుమారుడు సయ్యద్ సాదిక్ అన్వార్ (6) మృతి చెందాడు. మధ్యాహ్నం సమయంలో ఇంటిపైన ఇనుప టేప్ తో ఆడుకుంటున్నాడు. ఇంటి పక్క నుండి వెళ్తున్న 11 కె.వి విద్యుత్ వైర్లకు ఇనుప టేప్ తగిలి కరెంటు షాక్ తో అక్కడిక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్సై మహేష్ సంఘటన స్థలానికి వెళ్లి వివరాలను తెలుసుకున్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేష్ తెలిపారు.
Spread the love