స్వచ్ఛంద సంస్థ ద్వారా విద్యార్థుకు అల్పాహారం

 నవతెలంగాణ – రామారెడ్డి
 మండలంలోని 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న సందర్భంగా, సాయంత్రం మండలంలోని పాఠశాలలకు చెందిన 400 మంది విద్యార్థులకు నా రెడ్డి స్వచ్ఛంద సంస్థ ద్వారా అల్పాహారాన్ని నా రెడ్డి స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు, స్థానిక జెడ్పిటిసి నా రెడ్డి మోహన్ రెడ్డి సోమవారం ఆయా పాఠశాలలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విద్యార్థులకు సాయంత్రం సమయంలో ప్రత్యేక తరగతుల్లో అల్పాహారము లేదని, ఉపాధ్యాయులు తమ దృష్టికి తీసుకొచ్చారని,వెంటనే స్పందించి నా రెడ్డి స్వచ్ఛంద సంస్థ ద్వారా మండల విద్యార్థులకు అందజేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో రెడ్డి నాయక్, లక్ష్మీరాజం, బోజు నాయక్, కుమ్మరి శంకర్, ఆయా పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love