షాద్నగర్ లో బీఆర్ఎస్ గెలుపు ఖాయం.

– కొత్తూరు లో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఎన్నికల ప్రచారం
నవతెలంగాణ- కొత్తూరు: షాద్నగర్ లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మండలంలోని పలు గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉదయం మక్తగూడెంలో ప్రారంభమైన ఎన్నికల ప్రచార యాత్ర గూడూరు, పెద్దగుట్ట తండా, మల్లాపూర్ తాండ, రెడ్డిపాలెం, మల్లాపూర్, తాళ్లగూడ, అక్కి వేని గూడా, ఫాతిమాపూర్ మీదుగా తీగాపూర్ చేరుకుంది. గ్రామాల్లో మహిళలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ… ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ప్రవేశపెట్టిన పథకాల అమలు వాటి ఫలాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో ఇటు షాద్నగర్ నియోజకవర్గం లో బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ సాధించడం ఖాయం అయిపోయిందని అన్నారు. అధిక మెజార్టీ సాధనకై మీరంతా ముందుకు రావాలని ఓటర్లకు సూచించారు. బీఆర్ఎస్ గెలుపులో మీరంతా భాగస్వాములై అభివృద్ధిలో పాలు పంచుకోవాలని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు హయాంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని తెలిపారు. రాష్ట్ర సంక్షేమం దృష్ట్యా మీరంతా బీఆర్ఎస్ పక్షాన నిలబడాలని సూచించారు. బీఆర్ఎస్ గెలుపు నల్లేరు మీద నడకేనని, ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి అభివృద్ధికి పట్టం కట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి ఎమ్మె శ్రీలత సత్యనారాయణ, వైస్ ఎంపీపీ శోభ లింగం నాయక్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మెండే కృష్ణ యాదవ్, నాయకులు కడెంపల్లి శ్రీనివాస్ గౌడ్, నవీన్ రెడ్డి, బాతుక దేవేందర్ యాదవ్, సర్పంచులు కాట్న రాజు, డి సత్తయ్య, రవి నాయక్, మైసగళ్ల రమాదేవి రమేష్, సీనియర్ నాయకులు వడ్డే బాలయ్య,9 చిర్రా మధుసూదన్ రావు, కౌన్సిలర్ కోస్గి శ్రీనివాస్, ఎంపీటీసీలు చింతకింది రాజేందర్ గౌడ్, జగన్ మోహన్ రెడ్డి, చేగుర్ పిఎసిఎస్ వైస్ చైర్మన్ మున్నూరు పద్మారావు, బీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షులు కడల శ్రీశైలం, రైతు సమితి అధ్యక్షులు కళ్లెం నరసింహారెడ్డి, మక్తగూడ బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు దయ్యాల పాండు, బీఆర్ఎస్ గూడూరు గ్రామ కమిటీ అధ్యక్షులు గుండు సురేష్, నేనావత్ గోపాల్ నాయక్, బి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.
Spread the love