బీఆర్ఎస్ గ్రామ శాఖ సర్వసభ్య సమావేశం..బీ ఆర్ఎస్ మండల అధ్యక్షులు గిర్కటి నిరంజన్ గౌడ్

నవ తెలంగాణ-చౌటుప్పల్ రూరల్:  చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ సర్వసభ్య సమావేశం అధ్యక్షులు ఈడ్డుల మస్తాన్ బాబు అధ్యక్షతన మంగళవారం జరిగింది. ఈ సమావేశానికి టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గిర్కటి నిరంజన్ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరైనారు.ఈ సందర్భంగ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గిర్కటి నిరంజన్ గౌడ్ మాట్లాడుతూ కెసిఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాల గురించి గ్రామ గ్రామాన ప్రజలకు చేరవేయాలని ఆయన కోరారు.అనంతరం వివిధ పార్టీల నుండి బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు.కార్యక్రమంలో సర్పంచ్ ఎలువర్తి యాదగిరి,ఎంపీటీసీ చిట్టెంపల్లి శ్రీనివాసరావు, ఉపసర్పంచ్ మల్కాజ్గిరి కృష్ణ,పిఎసిఎస్ డైరెక్టర్ చౌడి బాలరాజు,రామలింగేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ సుంకరి సత్యనారాయణ,రైతుబంధు గ్రామ కమిటీ చైర్మన్ బోయిని లింగస్వామి,బిఆర్ఎస్ గ్రామ శాఖ కార్యదర్శి మహంకాళి పృద్వి,బీఆర్ఎస్ వార్డ్ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు

Spread the love