గడపగడపకు బీఆర్ఎస్ సంక్షేమ అభివృద్ధి పథకాలు

నవతెలంగాణ తుంగతుర్తి
తెలంగాణ ప్రజలకు కేసీఆర్ పాలన శ్రీరామరక్ష అని బీఆర్ఎస్ జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని గానుగుబండ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్యకర్తలతో కలిసి గడప గడపకు తిరుగుతూ బిఆర్ఎస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరిస్తూ కారు గుర్తుకు ఓటువేయాలని అన్నారు. నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలపై కృషి చేస్తున్న గాదరి కిషోర్ కుమార్ కు ఓటు వేయాలని సూచించారు. అలాగే ఈనెల 29న తిరుమలగిరిలో జరిగే భారీ బహిరంగ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతున్న తరుణంలో కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పోలెపాక పరమేష్, మాజీ ఎంపీటీసీ సీనియర్ నాయకులు గుండగాని దుర్గయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు గుండగాని శ్రీనివాస్, కంచర్ల కుశలవ రెడ్డి, ప్రవీణ్ వీరన్న యాదగిరి వార్డు మెంబర్లు సూర్యప్రకాష్ ,చంద్రయ్య, నాగమ్మ తదితరులు పాల్గొన్నారు.

Spread the love