పార్లమెంట్లో బీఆర్ఎస్ జీరో..

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ బీజేపీ హోరాహోరీగా ఉన్నాయి. 17 పార్లమెంట్ స్థానాల్లో చెరో 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఎంఐఎం ఒక్క స్థానంలో ఆధిక్యంలో ఉంది. అయితే బీఆర్ఎస్ ఒక్క స్థానంలో కూడా గెలిచే అవకాశాలు కనిపించడం లేదు. కేసీఆర్ కంచుకోట అయిన మెదక్ పార్లమెంట్ లో కూడా బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 30 వేలకు పైగా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 17 స్థానాల్లో పోటీచేసిన బీఆర్ఎస్ కేవలం రెండు చోట్ల మాత్రమే సెకండ్ ప్లేసులో ఉంది. ఎన్నడూ లేనంతగా పార్టీ చతికిలపడిపోయింది. 2001లో టీఆర్ఎస్ స్థాపించిన తర్వాత 2004 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కేసీఆర్ కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచారు. తర్వాత 2009 లోక్ సభ ఎన్నికల్లో మహబూబ్ నగర్ నుంచి కేసీఆర్, మెదక్ నుంచి విజయశాంతి టీఆర్ఎస్ నుంచి ఎంపీలుగా ఉన్నారు.

Spread the love