చందుర్తిలో నకిలీ ధృవీకరణ పత్రాల మూట..?

నవతెలంగాణ – చందుర్తి
మండలంలో అధికారుల పేరుతో నకిలీ ధృవపత్రాలను తయారు చేస్తున్నట్లుగా మండలంలో చర్చ కొనసాగుతుంది. జోగాపూర్ గ్రామానికి చెందిన బుర్ర వెంకటేష్  అనే వ్యక్తి ఇంటిలోను కోసం నకిలీ ధ్రువపత్రాలను తయారు చేయడంతో పలు అనుమానాలకు దారితీస్తుంది. దీంతో మండలంలోని కొంత మంది వ్యక్తులు నకిలీ సర్టిపేకెట్స్ తయారు చేస్తున్నట్లుగా జోగాపూర్ ఘటన తో తేట తల్లమైంది.
గతంలో జగిత్యాల ఆర్డీఓ పేరుతో నకిలీ ముద్రలు..?
మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి నకిలీ.పాస్.పుస్తకాలు సృష్టించి వాటి పై జగిత్యాల ఆర్డీఓ పేరుతో ముద్రలు తయారు చేసి ఫోర్జరీ సంతకాలు చేయడంతో జగిత్యాల పోలీసులకు  పిర్యాదు చేయగా  అట్టి విషయం మండలంలో సంచలనం రెకెత్తించింది. దీంతో మళ్ళీ నకిలీ సర్టిఫికెట్స్  తయారీ ముఠా మళ్ళీ దందా కొనసాగుతుందని మండలం ప్రచారం జోరుగా సాగుగుంది.ఇప్పటి కైనా పోలీసులు దృష్టి సారించేది ఎంతైనా ఉంది.
Spread the love