- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లాలో ఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్వేపై కిలోమీటర్ నంబర్ 262 వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో బిహార్కు చెందిన SI రామచంద్ర, ఒక ఖైదీ ఛత్రపాల్తో సహా ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. 10 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో తీవ్రంగా గాయపడిన వారిని లక్నో ట్రామా సెంటర్కు తరలించారు. SI రామచంద్ర ఖైదీని తీసుకుని ఢిల్లీకి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
- Advertisement -



