గడ్డం వంశీని భారీ మెజార్టితో గెలిపిద్దాం

నవతెలంగాణ – మంథని
భారతదేశ 18వ సాధారణ సార్వత్రిక ఎన్నికలలో భాగంగా పెద్దపల్లి లోకసభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశిక్రిష్ణను భారీ మెజార్టీ గెలిపించాలని సామాజిక రాజకీయ విశ్లేషకులు ఐఆర్వి రాజు,జాతీయ విశిష్ట సేవ రత్న అవార్డు గ్రహీత దార.మధులు కోరారు. ఎన్నికల విస్తృత ప్రచారంలో భాగంగా మంథని నియోజకవర్గంలోని గ్రామపంచాయితీలలోని విలోచవరం,ఉప్పట్ల,నాగారం,గుమ్మునూర్లలోని ప్రజలకు రాజ్యాంగంలో పొందుపరచిన ఓట్ల ప్రాముఖ్యతను గురించి అవగాహన కలిపిస్తూకాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోని 5 న్యాయాలు,25 గ్యారంటీలను గడప గడపకు తిరిగి వివరిస్తూ చేతి గుర్తుకే ఓటు వేసి గడ్డం వంశీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సామాజిక రాజకీయ విశ్లేషకులు ఐ ఆర్ వి రాజు,జాతీయ విశిష్ట సేవా రత్న అవార్డు గ్రహీత దార మధు,మాల మహానాడు కమాన్ పూర్ మండలం అద్యక్షులు గోషిక లింగయ్య,కాంగ్రెస్ నాయకులు రమేశ్, రాజేష్,అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love