క్యామ మల్లేశంను అధిక మెజారిటీతో గెలిపించాలి

నవతెలంగాణ – బొమ్మలరామారం

భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి క్యామ మల్లేశం  అధిక మెజారిటీతో గెలిపించాలని బి.ఆర్.ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పోలగోని వెంకటేష్ గౌడ్, మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు చిమ్ముల  సుధీర్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ….కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చే నాలుగు నెలలు గడుస్తున్న  ప్రజా సంక్షేమం  పట్టడం లేదని రోజు కరెంటు కోతలు  ఎండిన పంట పొలాలు ఎండిపోయిన చెరువులు రైతులకు రైతు బీమా రైతుబంధు డబ్బులు రుణమాఫీ చేయని అసమర్ధ ప్రభుత్వం  కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చి హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారని.ఈ పార్లమెంటు ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి, బిజెపి పార్టీకి తగిన గుణపాఠం చెప్పి మన భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి క్యామ మల్లేశం ను అధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love