ఘనంగా పి ఆర్ టి యు ఆవిర్భావ దినోత్సవ వేడుక

– పిఆర్ టియు మండల అధ్యక్షుడు యుగంధర్ రెడ్డి

నవతెలంగాణ – నెల్లికుదురు
పిఆర్ టియు ఆవిర్భావ దినోత్సవం వేడుకను ఘనంగా నిర్వహించినట్లు పి ఆర్ టి యు మండల అధ్యక్షుడు సోoటిరెడ్డి యుగంధర్ రెడ్డి తెలిపారు. మండల కేంద్రంలోని ఎమ్మార్సీ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జండా ఆవిష్కరించి సీనియర్ రిటైర్డ్ ఉపాధ్యాయుని శాలువాతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అతిపెద్ద యూనియన్ పిఆర్టియు అని అన్నారు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ముందుండి పోరాడే యూనియన్ ఒకటే పి ఆర్ టి అని అన్నారు ఈ కార్యక్రమంలో ఆ సంఘం  అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కే శ్రీనివాస్ రెడ్డి బి లక్ష్మణ్  రాష్ట్ర కార్యదర్శి బి సాయిలు జిల్లా మండల నాయకులు జనార్ధన్ సుధాకర్ ధనలక్ష్మి ఫణీంద్ర సంతోష్ వెంకట్ రెడ్డి జలీల్ పుష్పలీల తదితరులు పాల్గొన్నారు
Spread the love