బీఎస్పీ జిల్లా ముస్లిం మైనార్టీ అధ్యక్షులు గా చాంద్ పాషా

– అభినందించిన నాయకులు, కార్యకర్తలు.
నవ తెలంగాణ-సూర్యాపేట:
బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ముస్లిం మైనార్టీ అధ్యక్షులు గా చాంద్ పాషా ను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.యస్ ప్రవీణ్ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు బుధవారం స్థానిక విద్యానగర్ లో గల పార్టీ కార్యాలయంలో చాంద్ పాషా ను నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో చాంద్ పాషా మాట్లాడుతూ జిల్లాలో ముస్లిం మైనారిటీల అభివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్పారు. అదేవిధంగా జిల్లాలో బీఎస్పీ బలోపేతం కోసం పాటు పడుతానని పేర్కొన్నారు. ఇదిగాక సూర్యాపేట అసెంబ్లీ స్తానం నుండి బీఎస్పీ అభ్యర్థి గా పోటీ చేస్తున్న డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఇందుకు గాను పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను ప్రజల్లో కి తీసుకెళ్లి వారిలో చైతన్యం తీసుకొస్తామని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో బీ.ఆర్.యస్ ఓటమి చెందడం ఖాయమని తెలిపారు. తనపై గురుతర బాధ్యత పెట్టిన ఆర్.యస్ ప్రవీణ్ కుమార్ తో పాటు వట్టే జానయ్య యాదవ్, రేణుక, పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో  రాష్ట్ర అధికార ప్రతినిధి సాంబశివ గౌడ్, జిల్లా అధ్యక్షులు కొండ భీమయ్యగౌడ్, జిల్లా ఇన్చార్జ్ చడపంగు రవికుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి శ్రీనివాస్, నియోజకవర్గ నాయకులు వెంకన్న, స్టాలిన్ అంబెడ్కర్, తుంగతుర్తి నియోజకవర్గ అధ్యక్షులు మల్లేపాక వెంకటేష్, వైస్ ప్రెసిడెంట్ శోభ బాయ్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love