రోడ్డు ప్రమాదంలో 6 నెలల జైలు శిక్ష విధించిన చౌటుప్పల్ సివిల్ కోర్ట్

నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్:ఆరెగూడెం గ్రామానికి చెందిన పిల్లలమర్రి శ్రీనివాసు 2015లో లింగోజిగూడెం దివిస్ కంపెనీ వద్ద బైకుపై వెళుతుండగా వెనుక నుంచి బైకు పై వస్తున్న పంతంగి గ్రామానికి చెందిన కడగంచి తిరుమలేష్ తండ్రి ఐలయ్య రోడ్డు ప్రమాదంలో పిల్లలమర్రి శ్రీనివాసు కు తలకు,ఛాతికి బలమైన రక్త గాయాలు అయ్యాయి చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తుండగ మార్గమధ్యలో పిల్లలమరి శ్రీనివాసు మృతి చెందాడు.ఇట్టి ప్రమాదంపై అప్పటి చౌటుప్పల్ సబ్ ఇన్స్పెక్టర్ K.మల్లీశ్వరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి కోర్టుకు చార్జ్ షీట్ ఫైల్ చేశారు. అప్పటి రోడ్డు ప్రమాదం పై కడగంచి తిరుమలేష్ తండ్రి ఐలయ్యకు కేసు నంబర్ 87/2015 అండర్ సెక్షన్ 304(A),337 IPC కేసులో చౌటుప్పల్ జ్యూడిషియల్ సివిల్ కోర్ట్ న్యాయమూర్తి T.మహతి వైష్ణవి 6 నెలల జైలు శిక్ష మరియు1000 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పును వెల్లడించినట్టు మంగళవారం విలేకరులకు చౌటుప్పల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్.దేవేందర్ తెలిపారు.

Spread the love