నవతెలంగాణ – హైదరాబాద్: యూకే పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం జగన్ రాష్ట్రానికి తిరిగొచ్చారు. కాసేపటి క్రితం గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి తాడేపల్లి నివాసానికి వెళ్తారు. ఎన్నికల పోలింగ్ అనంతరం గత నెల 17న ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే.