ఆగస్టు 1న మహారాష్ట్ర పర్యటనకు సీఎం కేసీఆర్‌

నవతెలంగాణ – మహారాష్ట్ర
మహారాష్ట్రపై ఫోకస్ పెట్టిన తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన వ్యూహాలకు మరింత పదును పెడుతున్నారు. ఇటీవల 600 కార్ల భారీ కాన్వాయ్‌తో ఆయన మహారాష్ట్రకు వెళ్లి కలకలం రేపారు. తాజాగా ఆగస్ట్ 1న కేసీఆర్ మరోసారి మహారాష్ట్ర పర్యటనకు వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా మహారాష్ట్ర దళిత నేత అన్నా బావ్ సాటే జయంతి ఉత్సవాల్లో పాల్గొననున్నారు కేసిఆర్. అనంతరం కొల్హాపూర్ లోని మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్నారు సీఎం. ఆ తర్వాత సాహు మహారాజ్ మనవడిని కలవనున్నారు కేసీఆర్. అనంతరం హైదరాబాద్‌కు తిరుగు పయనం కానున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. ఇదిలా ఉంటే.. మహారాష్ట్రపై ఫోకస్ పెట్టిన తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన వ్యూహాలకు మరింత పదును పెడుతున్నారు. ఇటీవల 600 కార్ల భారీ కాన్వాయ్‌తో ఆయన మహారాష్ట్రకు వెళ్లి కలకలం రేపారు. తాజాగా ఆగస్ట్ 1న కేసీఆర్ మరోసారి మహారాష్ట్ర పర్యటనకు వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా మహారాష్ట్ర దళిత నేత అన్నా బావ్ సాటే జయంతి ఉత్సవాల్లో పాల్గొననున్నారు కేసిఆర్. అనంతరం కొల్హాపూర్ లోని మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్నారు సీఎం. ఆ తర్వాత సాహు మహారాజ్ మనవడిని కలవనున్నారు కేసీఆర్. అనంతరం హైదరాబాద్‌కు తిరుగు పయనం కానున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

Spread the love