- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : జపాన్లో జరిగిన ప్రతిష్ఠాత్మక జపాన్ ఓపెన్ సూపర్-750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విభాగంలో టైటిల్ విజేతగా నిలిచిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. కెరీర్లో తొలి సూపర్-750 టైటిల్ను సాధించడం భారత క్రీడా రంగానికి గర్వకారణమని పేర్కొన్నారు. తన ప్రతిభ, కృషి, పట్టుదలతో దేశ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న పీవీ సింధు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
- Advertisement -



