ఎస్టీయూటీఎస్‌ డైరీని ఆవిష్కరించిన సీఎం రేవంత్‌రెడ్డి

ఎస్టీయూటీఎస్‌ డైరీని ఆవిష్కరించిన సీఎం రేవంత్‌రెడ్డినవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
స్టేట్‌ టీచర్స్‌ యూనియన్‌ తెలంగాణ స్టేట్‌ (ఎస్టీయూటీఎస్‌) రూపొం దించిన నూతన సంవత్సర డైరీని ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డి శనివారం హైదరాబాద్‌లోని సచివాల యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి ఎస్టీయూటీఎస్‌ నాయకులు తీసుకొచ్చారు. వాటిపై ఆయన సానుకూలంగా స్పందించారు. త్వరలో ఉపాధ్యాయ సంఘాలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి సమస్యల పట్ల కూలంకశంగా చర్చిస్తామని హామీ ఇచ్చారని ఎస్టీయూటీఎస్‌ అధ్యక్షులు ఎం పర్వత్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి జి సదానందంగౌడ్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూటీఎస్‌ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి ఏ సదయ్య, రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షులు వై కరుణాకర్‌రెడ్డి, డైరీ కన్వీనర్‌ ఎవి సుధాకర్‌ ఏఐఎస్టీఎఫ్‌ జాతీయ సభ్యులు ఎన్‌ పరమేష్‌, హైదరాబాద్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పి రామసుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Spread the love