- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఆరు గ్యారెంటీలతో ప్రజలను మోసం చేసినందుకు సీఎం రేవంత్రెడ్డి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రిగా రేవంత్రెడ్డి విఫలమయ్యారని, రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్ వంటి పథకాలను నిలిపివేసి, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయకుండా విద్యావ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. మాజీ సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకులు ర్యాలీలు నిర్వహించడం ‘ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే’ అన్నట్లుగా ఉందని ఆయన ఆరోపించారు.
- Advertisement -



