- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : కాక్రోచ్ జనతా పార్టీ తన సంస్థాగత విస్తరణలో భాగంగా కొత్త నియామకాలు చేపట్టింది. పార్టీ సంస్థాగత వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఒక సంయుక్త కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు), ఐదుగురు సంయుక్త కార్యదర్శులు, ఇద్దరు జాతీయ అధికార ప్రతినిధులు, జోనల్ కమిటీలను CJP ప్రకటించింది. రేఖా శర్మ, అక్షయ్ షిండే, ప్రేమ్ ఆకాష్, అనం ఉజ్జామా, బాలకృష్ణ శుక్లా సంయుక్త కార్యదర్శులుగా, సుధీర్ సాంగ్వాన్, సిద్ధాంత్ భరద్వాజ్లు జాతీయ ప్రతినిధులుగా ఎంపికయ్యారు. క్షేత్రస్థాయి కార్యకలాపాల సమన్వయం కోసం నార్త్, ఈస్ట్, వెస్ట్ జోన్లకు ప్రత్యేక కోఆర్డినేషన్ కమిటీలను ఏర్పాటు చేశారు.
- Advertisement -



