- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
వనమహోత్సవంలో భాగంగా మండల పరిధిలోని బస్వాపూర్ లో ఆ గ్రామ సర్పంచ్ సురేష్ రమణగొండ ఆధ్వర్యంలో మంగళవారం మొక్కలను నాటారు. ఆయనతో పాటు ఉపసర్పంచ్ అనిల్ కుమార్, కార్యదర్శి భరద్వాజ్, ఫీల్డ్ అసిస్టెంట్ రాజు మొక్కలు నాటి గ్రామస్తులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ వార్డ్ సభ్యులు కె. మల్లు కొండ, ఎం. నాగనాథ్, ఐకెపి వివో బి. భాస్కర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జయచంద్, కేజీబీవీ, పాఠశాల, ఎస్ ఓ హేమలత, ఉపాధి హామీ కూలీలు, ఉప్పరి నారాయణ, మనోహర్, సాకలి విట్టల్, మేత్రి బాలయ్య, మహమ్మద్ సాబ్ కమ్మరి నాగనాథ్, సుంకరి హనుమండ్లు, గ్రామపంచాయతీ, వాటర్ మెన్ వీరయ్య, పంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్ రాజు గ్రామస్తులు పాల్గొన్నారు.
- Advertisement -



