ప్రజావాణిలో జిల్లా అధికారులు తప్పక పాల్గొనాలి : కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్

– మండల ప్రజావాణిలో మండల స్థాయి అధికారులు తప్పక హాజరు కావాలి
– ఫిర్యాదుదారుడికి స్పష్టమైన వివరణ ఇవ్వాలి..
– ఏ అధికారి పాల్గొనక పోయిన చర్యలు తప్పవు..
 
నవతెలంగాణ సూర్యాపేట కలెక్టరేట్
 సోమవారం నిర్వహించే  ప్రజావాణి కార్యక్రమం యధావిధిగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.ప్రజావాణిలో వచ్చె దరఖాస్తులను వెంటనే పరిష్కరించే విధంగా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తు దారునికి కంపల్సరిగా రసీదు ఇవ్వాలని కలెక్టర్ తెలిపారు. మండల స్థాయిలో వచ్చు దరఖాస్తు లకు వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని, దరఖాసుదారులకు స్పష్టమైన వివరణ ఇవ్వాలని కలెక్టర్ తెలిపారు.జిల్లా మండల స్థాయిలో జరిగే ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు తప్పక హాజరుకావాలని హాజరుకాని అధికారులపై చర్యలు తీసుకోబడతాయని కలెక్టర్ తెలిపారు. ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలిపారు.
Spread the love