జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత రామానుజాచార్యులు ఆకాల మరణం పట్ల సంతాపం

నవతెలంగాణ- హాలియా:  జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మాజీ హాలియా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముడుంబై రామానుజాచార్యులు ఆకాల మరణం పట్ల పి ఆర్ టి యు టి ఎస్ అనుముల, పెద్దవూర, తిరుమలగిరి సాగర్ శాఖల ఆధ్వర్యంలో హలియా పట్టణంలోని బస్టాండ్ సెంటర్లో ఆయన చిత్ర పటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్భంగా ఉపాధ్యాయ వృత్తికే వన్నెతెచ్చి ఎందరో పేద అట్టడుగు వర్గాల విద్యార్థులకు స్వంత డబ్బు వెచ్చించి ఉన్నత విద్య చదివేందుకు, వారు ఉన్నత ఉద్యోగాలు సాధించేందుకు విలువైన సలహాలు సూచనలు అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపిన ఆదర్శ ఉపాధ్యాయులు రామానుజాచార్యులు సార్ అని పి ఆర్ టి యు టి ఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు నెమలి వెంకటరెడ్డి, ఉపాధ్యక్షులు మందా సైదులు రావు గౌతమ్ అన్నారు. తన జీవితాంతం పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేసిన మహోన్నత ఉపాధ్యాయులు రామానుజాచార్యులు అని భావి తరాలకు ఆదర్శనీయులు అని ఆయన సేవలను కొనియాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ అసోసియేట్ అధ్యక్షులు వాసుదేవుల పుల్లారెడ్డి, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు మేదరి దేవేందర్, ఉపాధ్యక్షులు ఇరుమాది పాపిరెడ్డి, తిరుమలగిరి సాగర్ అధ్యక్షులు మొక్క పరుశ్ రామ్ గౌడ్, లెక్చరర్ కంభంపాటి లక్ష్మణ్, వాసుదేవుల ఉపేందర్ రెడ్డి, మాలే అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love